Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ కారుకు తుపాకీ ఎక్కుపెట్టిన సెక్యూరిటీ.. ఎందుకు?

Advertiesment
Parliament Live
పార్లమెంట్ మలిదశ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పోటాపోటీగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ అల్లర్లు పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తున్నాయి. ఈ తరుణంలో పార్లమెంట్ ప్రాంగణంలోని ఒకటో నంబరు ప్రధాన ద్వారం వద్ద కలకలం చెలరేగింది. దీంతో ఓ ఎంపీ కారుకు క్విక్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన భద్రతా బలగాలు తుపాకీ ఎక్కుపెట్టారు. 
 
అసలు ఎంపీ కారుకు తుపాకీ ఎందుకు ఎక్కుపెట్టారో తెలుసుకుందాం. మంగళవారం సమావేశాలు ప్రారంభంకావడానికి ముందు గేట్ నెంబ‌ర్ వ‌న్ వ‌ద్ద కలకలం చెలరేగింది. బూమ్ బ్యారికేడ్‌ను ఓ కారు ఢీ కొట్టడంతో దాని నుంచి స్పైక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి, ఆ కారు అక్క‌డే నిలిచిపోయింది. వెంటనే సైర‌న్ మోగడంతో అక్కడ ఉన్న భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మై ఏకే 47 తుపాకులతో ఆ కారుకి గురిపెట్టారు.
 
ఆ కారు బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన‌క‌ర్‌దని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఆ కారు స్వల్పంగా ధ్వంసమైంది. పొరపాటున ఆ కారు వాటికి తగిలిందని భద్రతా బలగాలు గుర్తించాయి. కాగా, 2001లో పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగిన త‌ర్వాత‌ భద్రతను కట్టుదిట్టం చేస్తూ.. పార్లమెంటు గేట్ల వ‌ద్ద స్పైక్స్‌ల‌ను అమ‌ర్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ తినిపించి ప్రేమలో పడేశాడు.. వాడుకుని వదిలేశాడు...