Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రుడిపై 4జీ, 5జీ నెట్వర్క్‌లకు ఏర్పాటు, నాసాతో డీల్ కుదుర్చుకున్న నోకియా

Advertiesment
Interesting
, సోమవారం, 19 అక్టోబరు 2020 (13:22 IST)
వినేందుకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇకమీదట చంద్రుడి మీదకు వెళ్లే వాళ్లు తమ స్మార్ట్ పోన్లను తీసుకెళ్లి అక్కడి నుంచి వాడుకోవచ్చు. చంద్రుడిపై మొబైల్ ఫోన్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయాలని, అది కూడా 4జీ, 5జీ తరంగాల కమ్యూనికేషన్ నెట్వర్క్‌గా ఉండాలని భావిస్తున్న నాసా (అమెరికా అంతరి పరిశోధన సంస్థ) అందుకోసం ప్రముఖ టెలీ సంస్థ నోకియాతో డీల్ కుదుర్చుకుంది.
 
ఇందులో భాగంగా చందమామపై 4జి సెల్యులర్ నెట్వర్క్‌ను నోకియా ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధిని అందించనుంది. తొలుత చందమామపై 4జీఎల్జీఈ నెట్వర్క్‌ను ఏర్పాటు చేయనున్న నోకియా తదుపరి దశలో దానిని 5జీకి అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందితే చంద్రుడి ఉపరితలంపై సమాచార మార్పిడి మరింత వేగవంతమవుతుందని, దీంతో మరింత విశ్వనీయ సమాచారాన్ని ఎప్పటికప్పడు పొందవచ్చని నాసా వ్యాఖ్యానించింది.
 
మరో 8 సంవత్సరాలలో అనగా 2028లో చంద్రుడిపై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే లక్ష్యాన్ని గతంలోనే నిర్థేశించుకున్న నాసా అందుకు తగ్గట్టుగా తన ప్రణాళికను రూపొందిస్తోందని కార్యనిర్వాహక ప్రతినిధి జిమ్ బ్రిడెన్ స్వైన్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ అధ్యక్షుడు(ఏపి)గా అచ్చెన్నాయుడు... పొలిట్ బ్యూరోలోకి సుహాసిని