Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదు.. : రాహుల్ గాంధీ

మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పలువురు నేతలు నివాళులు అర్పించారు. వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు

గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదు.. : రాహుల్ గాంధీ
, మంగళవారం, 2 అక్టోబరు 2018 (11:32 IST)
మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పలువురు నేతలు నివాళులు అర్పించారు. వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
 
ఆ తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీ అంటే కదల్లేని విగ్రహం కాదన్నారు. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని ఆయన వ్యాఖ్యానించారు. సత్యం, అహింస కోసం జీవించిన గాంధీజీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. నిజమైన దేశ భక్తులు గాంధీజీ విలువలను కాపాడాలి అని పేర్కొంటూ రాహుల్‌ ఓ ట్వీట్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్డ్ డిస్క్‌లో ఏముందో నాకెలా తెలుసు బాస్ : ఉదయ్ సింహా