Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒడిషాలో విధ్వంసం సృష్టించిన ఫోనీ తుఫాన్(Video)

Advertiesment
Foni cyclone
, శుక్రవారం, 3 మే 2019 (19:41 IST)
బంగాళాఖాతంలో సుదీర్ఘంగా ప్రయాణించిన ఫోనీ తుఫాన్ తొలుత తమిళనాడు తీరాన్ని తాకుతుందనీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు. ఐతే అది ఒడిషా వద్ద తీరాన్ని దాటింది. దీనితో ఇక్కడ ప్రచంఢ గాలులతో బీభత్సం సృష్టించింది ఫోనీ తుఫాన్.

భువనేశ్వర్ లోని ఎయిమ్స్ హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది. అంతేకాదు.. క్లాసు రూముల్లో వున్న ఫర్నీచర్, కంప్యూటర్లు కాగితాల మాదిరిగా గాల్లో ఎగెరెళ్లిపోయాయి. సమీపంలో వున్న భారీ కట్టడానికి ఉపయోగించే క్రేన్ సైతం భారీ గాలుల దెబ్బకు కూలిపోయింది.


ఇక భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పెకలించుకుపోయాయి. వేల సంఖ్యలో గుడిసెలు నేలమట్టమవ్వటమే కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైనట్లు తెలుస్తుంది. కాగా ఫోనీ తుఫాన్ కారణంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సుమారు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ఈ తుఫాన్ భారీ నష్టాన్ని కలిగించిందని ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐడియా అదిరిపోయే ఆఫర్...