Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ వెన్నులో వణుకు.. ఎందుకు?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్, బీజేపీలతో పాటు.. జేడీఎస్ పార్టీలకు చెందిన నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.

Advertiesment
Congress
, గురువారం, 3 మే 2018 (08:55 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్, బీజేపీలతో పాటు.. జేడీఎస్ పార్టీలకు చెందిన నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వెన్నులో వణుకు పుట్టేలా ఆర్ఎస్ఎస్ ఓ వార్తను వెల్లడించింది.
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో బీజేపీకి 70కిమించి సీట్లు రావని అంచనావేసి ఖంగుతినిపించింది. ఈ నివేదికను దక్షిణ భారత ప్రాంతీయ ప్రముఖ్‌ వి.నాగరాజ్‌ బెంగళూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు స్వయంగా అందజేసినట్లు సమాచారం. ఇక.. కాంగ్రెస్ పార్టీకి 115 నుంచి 120 సీట్లు, జేడీఎస్‌కు 29 నుంచి 34 సీట్లు లభిస్తాయని అందులో ప్రస్తావించడం గమనార్హం. 
 
రాష్ట్రంలో అహింద (అల్పసంఖ్యాకులు, బలహీనవర్గాలు, దళితుల) ఓట్లను క్రోడీకరించే విషయంలో బీజేపీ విఫలమైందని ఆర్‌ఎస్ఎస్‌ తన సమీక్షలో పేర్కొన్నట్లు భోగట్టా. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు లింగాయత్‌ కులస్తులపై పట్టు తప్పిందనీ, గాలి జనార్ధన్ రెడ్డి వర్గానికి పార్టీలో మళ్లీ పెద్దపీట వేయడం, వీటికి తోడు జీఎస్టీ ప్రభావం, నిరుద్యోగ సమస్య, అడ్డూ అదుపులేకుండా పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు బీజేపీపై ప్రజల్లో సదాభిప్రాయం లేకుండా చేస్తున్నాయని ఆర్ఎస్ఎస్ సర్వేలో వెల్లడైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్