Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మురళీ మోహన్ కంపెనీ జయభేరీ కన్‌స్ట్రక్షన్స్ పైన ఏపీ ప్రభుత్వం భారీ జరిమానా

Advertiesment
AP government
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (21:38 IST)
ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్ కు అధికారులు భారీ జరిమానా వడ్డించారు. అమరావతిని ఆనుకుని ఉండే కుంచనపల్లిలో జయభేరి కన్‌స్ట్రక్షన్స్ నిర్మించిన భవనాలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న అధికారులు రూ.1.5 కోట్లు జరిమానాగా విధించారు.
 
జాతీయ రహదారి పక్కనే ఉండే కుంచనపల్లిలో 7 ఎకరాల 5 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్ 2016లో నిర్మాణాలు చేపట్టింది. అయితే, ఇది వ్యవసాయ భూమి కాగా దీంట్లోనే నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించలేదని జయభేరి కన్‌స్ట్రక్షన్స్ పై ప్రస్తుత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
 
రంగంలోకి దిగిన అధికారులు 3 శాతం ల్యాండ్ కన్వర్షన్ ఫీజుతో పాటు జరిమానా కూడా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు రూ.1 కోటి, అపరాధ రుసుం కింద మరో రూ.50 లక్షలు చెల్లించాలని జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ను ఆదేశించారు. ఈ జరిమానాను జయభేరి సంస్థ చెల్లించినట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌కు కష్టకాలం.. చలించిపోతున్న ప్రపంచం : ఐక్యమైన 40 టాప్ కంపెనీల సీఈవోలు