Publish Date: Fri, 24 Jun 2022 (17:34 IST)
Updated Date: Fri, 24 Jun 2022 (17:39 IST)
ప్రజల మేలును రాజు కోరితేనే ప్రజలు కూడా రజు మేలును కోరుతారు. ప్రజల కోరికలను తెలుసుకునేందుకు బ్రహ్మలా అందరికీ ఆత్మలాగా మెలగాలి.
ఏ సందర్భంలోనూ విసుక్కోకుండా ప్రజలను రక్షిస్తూవుండాలి. ఎవరు ఆపదలో వుండి మొర పెట్టినా వారి ఆపదను పోగొట్టాలి. కామ పురుషుల మీద కార్యభారం పెట్టరాదు.
ఆప్తబంధువులకే రక్షణా భారాల్ని ఇవ్వాలి. ఎవరినిబడితే వారిని నమ్మి, కోట కాపలా రక్షణా భారాన్ని ఇవ్వకూడదు. ఇవి రాజ్య విచ్ఛిత్తికి కారణం కాగలదు.
ఎవరినైనా ముందుగా అభిమానించి పెద్దలను చేయడం తేలిక. కానీ అలా పెంచినవారిని మళ్లీ దిగువకు కుదించినప్పుడు.. వారు తమ పూర్వస్థితికి తలచుకుని.. అలిగితే శత్రువులుగా మారుతారు. అందుకే ఆశ్రయానికి ముందే గుణశీలాన్ని గమనించాలి.