Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పెళ్లి చూపులు' డైరెక్టర్ తాజా చిత్రం ''మెంటల్ మదిలో'' (Trailer)

యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో (మనవి ఆలకించరాదటె! అనేది ట్యాగ్ లైన్). ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు

'పెళ్లి చూపులు' డైరెక్టర్ తాజా చిత్రం ''మెంటల్ మదిలో'' (Trailer)
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (20:39 IST)
యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా  'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో (మనవి ఆలకించరాదటె! అనేది ట్యాగ్ లైన్). ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ సినిమా ద్వారా 'నివేతా పేతురాజ్' కథానాయికగా తెలుగు వెండితెరకు పరిచయమవుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు విడుదల చేశారు. 
 
నాయకా నాయికల మధ్య ప్రేమ .. ఘర్షణకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్‌‌ను కట్ చేశారు. ట్రైలర్ ద్వారా కంటెంట్‌ను చెబుతూనే ఆసక్తిని రేకెత్తించారు. యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే విషయం ఈ ట్రైలర్‌తో అర్థమైపోతోంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేసి .. అదే రోజున సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత వెల్లడించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైవ్ టీవీ షోలో ఓ జంట దుప్పట్లో దూరి ఆ పని కానించేసింది...