Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లద్దాలు.. మాసినగెడ్డం... తలకు టోపీ... బాబా వేషంలో వచ్చి డీజే చూసిన హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్

నల్లద్దాలు.. మాసినగెడ్డం... తలకు టోపీ... బాబా వేషంలో వచ్చి డీజే చూసిన హీరో
, సోమవారం, 26 జూన్ 2017 (10:54 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రాన్ని విడుదల రోజే తిలకించాలని టాలీవుడ్ యువ హీరో ఒకరు భావించారు.
 
అయితే, హీరోగా వెళితే అభిమానులు గోలగోల చేస్తారని భావించిన ఆ హీరో మారు వేషం వేశాడు. తలకు టోపీ, కళ్ళకు నల్లద్దాలు, మాసిగెడ్డంతో అచ్చం బాబాలా థియేటర్‌కు వచ్చి... సినిమాను హాయిగా చూసి వెళ్లాడు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసి ఈ విష‌యాన్ని వెల్లడించాడు రాజ్ త‌రుణ్. ఇప్పుడు ఆ విష‌యం తెలుసుకున్న అమ‌లాపురం ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.
 
ఇటీవ‌ల "అంధ‌గాడు" సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ప్రస్తుతం అమలాపురం పరిసరాల్లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీంతో అమలాపురంలోని ఓ థియేటర్‌లో ఈ చిత్రాన్ని రాజ్ తరుణ్ వీక్షించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భరత్‌ను కడచూపు చూడని రవితేజ.. రూ.1500 ఇచ్చి అంత్యక్రియలు పూర్తి చేయించారు.. ఎవరు?