Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్నారా? ఆయన ఎక్కడా కనిపించట్లేదే..?!

ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్నారా? ఆయన ఎక్కడా కనిపించట్లేదే..?!
, బుధవారం, 23 డిశెంబరు 2020 (21:19 IST)
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్సును నిరాశపరుస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ఎందుకంటే..? ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకకు తెలుగు తారలు మహేష్, ప్రభాస్, చిరంజీవి, నాగచైతన్య, సమంతా, పూజా హెగ్డే ఇలా అందరూ వచ్చారు. కానీ వారిలో ఎన్‌టీఆర్ మాత్రం కనిపించలేదు. దాని తరువాత నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లిలో కూడా ఎక్కడా ఎన్‌టీఆర్ కనిపించలేదు. 
 
ఈ పెళ్లికి బాలకృష్ణ దంపతులు వీచ్చేశారు. కళ్యాణ్ రామ్ కూడా సతీసమేతంగా ఈ పెళ్లికి హాజరయ్యాడు. దీంతో తారక్ వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడని అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 
 
అయితే ఎన్‌టీఆర్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొత్త గెటప్ అందరికి తెలిపోతుందని అలా చేస్తున్నాడని కొందరు అంటే మరి కొందరు నందమూరి కుటుంబంలోని వారు ఎన్‌టీఆర్‌ను దూరం పెడుతున్నారని అంటున్నారు. అయితే దీనికి సరైన సమాధానం అయితే తెలియదు కానీ, ఎన్‌టీఆర్ ఇలా పార్టీలకు దూరంగా ఉండటం అభిమానులకు నిరాశను కలిగిస్తోంది. మరి ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవిని మంచు ఫ్యామిలీ సభ్యులు ఎందుకు కలుస్తున్నారు?