Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తంబీ రజినీకాంత్.. నిన్ను మింగడానికి ఎన్నో మొసళ్లు వేచివున్నాయి... స్మగ్లర్ వీరప్పన్

veerappan
, బుధవారం, 13 డిశెంబరు 2023 (14:31 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఓ విజ్ఞప్తి చేశారు. తంబీ.. నిన్ను మింగడానికి ఎన్నో మొసళ్లు వేచి ఉన్నాయంటూ చేసిన సూచన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటి.. వీరప్పన్ చనిపోయారు కదా.. ఆయన ఇపుడు రజినీకాంత్‌కు సూచన చేయడమేంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి... 
 
వీరప్పన్ జీవితంలో చోటు చేసుకున్న అనేక వాస్తవిక అంశాలపై తెరకెక్కిన వెబ్ సిరీస్ 'కూసే మునిసామి వీరప్పన్'. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియోను జీ5 తాజాగా విడుదల చేసింది. అందులో.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో వీరప్పన్ తనదైనశైలిలో స్పందిస్తారు. ఆయనను దోచుకునేందుకు, మింగేసేందుకు చాలా మొసళ్లు వేచి చూస్తున్నాయని హెచ్చరించారు.
 
'ఆయన (ఎంజీఆర్) చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజల కష్టాలు ఆయనకు తెలుసు. ఎంజీఆర్ వంటి వారు పుట్టడం కష్టం. అయితే, రజినీకాంత్ కూడా ఆయనలా అవుతారని నాకు బాగా తెలుసు. రజినీకాంత్ అందరినీ గౌరవిస్తారు. ఎవరి పట్లా అమర్యాదగా ప్రవర్తించరు. దేవుడిని బాగా నమ్ముతారు. కానీ, ఒక్క విషయం. అయ్యా రజినీకాంత్.. నేను నీతో మాట్లాడుతున్నా.. రాజకీయాల్లోకి రావద్దు. ఎవరికీ మద్దతు తెలపవద్దు. నిన్ను మింగడానికి ఎన్నో మొసళ్లు వేచి చూస్తున్నాయి. అవి ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయ చేసి అమాయకుడిలా బలికావద్దు' అంటూ వీరప్పన్ మాట్లాడిన దృశ్యాలను విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.కోట్లు సంపాదిస్తున్న బాలీవుడ్ హీరోయిన్లు.. ఎలా?