సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం 'కూలీ'. ఈ నె 14వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్తో సహా అనేక మంది అగ్రనటులు నటించారు. వీరిలో బాలీవుడ్ నటు అమీర్ ఖాన్, టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర, కోలీవుడ్ నటుడు సత్యరాజ్, హీరోయిన్ శృతిహాసన్ ఇలా అనేక మంది నటించారు.
అయితే, ఇపుడు వీరికి అందించిన పారితోషికం వివరాలు బహిర్గతమయ్యాయ. ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల మేరకు, ఈ చిత్రంలో దేవా పాత్రను పోషించిన రజనీకాంత్కు రూ.200 కోట్లు, అమీర్ ఖాన్కు రూ.20 కోట్లు, నాగార్జునకు రూ.10 కోట్లు, సత్యరాజ్, ఉపేంద్రలకు రూ.5 కోట్లు, శృతిహాసన్కు 4 కోట్లు, సంగీత దర్శకుడు అనిరుధ్కు రూ.15 కోట్లు చొప్పున చెల్లించినట్టు సమాచారం. రజనీకాంత్కు ఈ చిత్రంలో తొలుత రూ.150 కోట్ల పారితోషికం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉండటంతో నిర్మాతలు ఆయన పారితోషికాన్ని రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పెంచినట్టు సమాచారం.
మరోవైపు, 'కూలీ' చిత్రం అడ్వాన్స్డ్ బుకింగ్స్లో దూసుకునిపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ సేల్స్లో రూ.14 కోట్లు వసూలు చేయగా, ఈ నెల 14వ తేదీనే విడుదలవుతున్న వార్-2 చిత్రం కేవలం రూ.2.08 కోట్లు మాత్రమే రాబట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భా,ల్లో ఈ చిత్రం 6 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోగా, బ్లాక్ సీట్లతో కలిపితే ఈ మొత్తం రూ.20 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు.