Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుశాంత్‌కు అల వైకుంఠ‌పుర‌ములో అందుకే అవ‌కాశ‌మిచ్చాః త్రివిక్ర‌మ్

సుశాంత్‌కు అల వైకుంఠ‌పుర‌ములో అందుకే అవ‌కాశ‌మిచ్చాః త్రివిక్ర‌మ్
, బుధవారం, 25 ఆగస్టు 2021 (13:36 IST)
susanth-trivikram
సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.
 
ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇండియాలోనే కాదు, ప్ర‌పంచం మొత్తం మీద థియేట‌ర్‌కు రావ‌డానికి సాహ‌సిస్తున్న జాతి తెలుగు జాతి మాత్ర‌మే. ఏమీ భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు. మంచి కంటెంట్ క్రియేట్ చేసి మ‌రింత ముందుకు వెళ్దాం. ఈ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అల వైకుంఠ‌పుర‌ములో షూటింగ్ టైమ్‌లోనే సుశాంత్ చెప్పాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని నేను కూడా బ‌య‌ట వింటున్నాను.

సుశాంత్ త‌న‌కు తెలియ‌కుండా ఓ చ‌ట్రంలో ఇరుక్కుపోయాడ‌ని అనుకునేవాడిని. అయితే నాకు తెలిసి చి.ల‌.సౌ సినిమాతో త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకునే ప‌నిలో ప‌డ్డాడు. ఆ సినిమా చూసే త‌న‌ని నా అల వైకుంఠ‌పుర‌ములో యాక్ట్ చేయ‌మ‌ని అడిగాను. ఇప్పుడు త‌న హ్యాట్రిక్ మూవీ ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు. ఈ సినిమాతో ప్రొడ్యూస‌ర్ నుంచి గ‌వ‌ర్న‌మెంట్‌కు బోల్డెంత ట్యాక్స్ క‌ట్టించాలి అంటూ సెటైర్ వేశారు.
 
ఇక ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్ గురించి చెబుతూ, ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందో తెలుసు. ఓ సినిమాను మిక్సింగ్ చేసి వ‌దిలేస్తుంటే మ‌నింటి ఆడపిల్ల‌ను ఎవ‌రికో ఇచ్చేసి పంపిచేస్తున్న‌ట్లుగా ఉంటుంది. అందులో ఫ‌స్ట్ మూవీ అనేస‌రికి ఇంకా బాధ‌గా ఉంటుంది. కాకుంటే ఆడపిల్ల వెళ్లి సెప‌రేట్ ఎస్టాబ్లిష్ ఎలా చేస్తుంద‌నే ఆనందంగా పంపిస్తామో, సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని, ప్ర‌జ‌ల జీవితాల్లోకి వెళ్లిపోయి.

థియేట‌ర్స్‌లో, టీవీల్లో, మొబైల్ ఫోన్స్‌లో, కామెడీ సీన్స్‌లో, సాంగ్స్‌లో, షోస్‌లో దానికి తాలుకు శ‌బ్దం వినిపిస్తున్న‌ప్పుడు, దాని జీవితం తాలుకు స్పాన్ పెరుగుతున్న‌ప్పుడు మ‌న‌కు మ‌రింత ఆనందంగా, గ‌ర్వంగా, ఉత్సాహంగానూ ఉంటుంది. అలాంటి రోజులు మ‌రిన్ని ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌కు రావాల‌ని కోరుకుంటున్నాను. ప్రవీణ్ ల‌క్క‌రాజు మ్యూజిక్ బాగా న‌చ్చింది. యాక్ట‌ర్ వెంక‌ట్.. ట్రూ హైద‌రాబాదీ. నేను హైద‌రాబాద్ వ‌చ్చిన కొత్త‌ల్లో ఈయ‌న న‌టించిన సీతారాముల క‌ళ్యాణం చూత‌మురారండి సినిమా చూశాను. నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్ అభిన‌వ గోమ‌టం, మీనాక్షి చౌద‌రి ఆల్ ది బెస్ట్‌. ప్రియ‌ద‌ర్శిని పెళ్లిచూపుల నుంచి చూస్తున్నాను. సిన్సియ‌ర్ యాక్ట‌ర్‌. ఇలా అంద‌రికీ అభినంద‌న‌లు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
మామ‌య్య స్వంత‌గా ఆలోచించ‌మ‌న్నాడు
హీరో సుశాంత్ మాట్లాడుతూ, చి.ల‌.సౌ స‌మ‌యంలో నాగార్జున మామ‌య్య న‌న్ను పిలిచి సినిమా ఆడినా, ఆడ‌క‌పోయినా ఇండిపెండెంట్‌గా ఆలోచించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. కొత్త హీరోలా ఆలోచించి రాహుల్‌తో క‌లిసి కొత్త జ‌ర్నీలా స్టార్ట్ చేశాం. ఆ సినిమా చేసిన‌ప్పుడు నేను ఊహించ‌లేదు కూడా. ఆ టైమ్‌లో నన్ను న‌మ్మి సినిమా చేసిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌. రాహుల్ సినిమాను చైత‌న్య‌, స‌మంత‌ల‌కు చూపించాడు. చైత‌న్య‌కు సినిమా న‌చ్చింది.

చైత‌న్య ఆ సినిమాను నాగార్జున‌కు చూపించాడు. ఆయ‌న న‌చ్చ‌డంతో ఆయ‌న పార్ట్‌న‌ర్‌గా మారి సినిమా రిలీజ్ చేశారు. అక్క‌డి నుంచి ఇండిపెండెంట్‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స్టార్ట్ చేశాను. అల వైకుంఠ‌పుర‌ములో సినిమాను త్రివిక్ర‌మ్‌గారు అడ‌గ్గానే ఏమీ ఆలోచించ‌కుండా చేస్తాన‌ని అన్నాను. అందుకు కార‌ణం అక్క‌డ బ‌న్నీ, ట‌బుగారు ఇలా అంద‌రూ ఉంటారు. ఏదైనా నేర్చుకోవ‌చ్చున‌ని నా ఫీలింగ్‌. అక్క‌డ నుంచి కొత్త మూమెంట్ స్టార్ట్ అయ్యింది.
 
ఈ సినిమా విష‌యానికి వ‌స్తే డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్‌ను హ‌రీశ్ ద్వారా సాగ‌ర్‌గారు నాకు ప‌రిచ‌యం చేశారు. క‌థ న‌చ్చింది. అయితే అప్ప‌టికే ఆ క‌థ‌కు అడ్వాన్స్ ఇచ్చిన నిరంజ‌న్ రెడ్డిగారు, నేను రిక్వెస్ట్ చేయ‌డంతో, నీకు బావుంటుంది చేయ‌మ‌ని అన్నాడు. శ్రీనివాస్ అవ‌స‌రాల క‌థ విని కొన్ని చిన్న చిన్న స‌ల‌హాలు ఇచ్చాడు. హ‌రీశ్ ఇత‌ర స్నేహితులు ఎంతో స‌పోర్ట్ చేశారు. ఓటీటీ ఆఫ‌ర్స్ కూడా వ‌చ్చాయి. కానీ నిర్మాత‌లు థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 
 
ద‌ర్శ‌న్ ఈ క‌థ‌ను చెప్ప‌డానికి ముందు మ‌రో క‌థ‌ను చెప్పాడు. డార్క్ క‌థ కావ‌డంతో నిరంజ‌న్‌గారి ప‌ర్మిష‌న్‌తో ఈ సినిమా చేశాం. నిజ ఘ‌ట‌న ఆధారంగా చేసుకుని చేసిన సినిమా. నా పాత్ర‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. చాలా ఓపెనెప్ అయ్యి ఈ సినిమా చూశాను.

ఇలాంటి పాత్ర‌ను నాకు ఇచ్చిన ద‌ర్శ‌న్‌కు థాంక్స్‌. కొత్త సుశాంత్‌ను ద‌ర్శ‌న్ చూపించాడు. హ‌రీశ్ నా సినిమాకు నిర్మాతే కాదు, మంచి స్నేహితుడు కూడా. చి.ల‌.సౌకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్న హ‌రీశ్‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాకు నిర్మాత‌గా మారాడు. ముంబైలో వ‌ర్కింగ్ షాప్‌లో మీనాక్షి చౌద‌రిని క‌లిశాను. అప్పుడు ఈ సినిమాలో చేయ‌మ‌ని అడిగాను. ఇక ప్రియ‌ద‌ర్శి చాలా ఇంపాక్ట్ రోల్ చేశాడు. వెన్నెల‌కిషోర్‌గారు బిజీగా ఉన్నా డేట్స్ అడ్జ‌స్ట్ చేసి సినిమా చేశాడు. ఈ సినిమా కాన్సెప్ట్ బేస్డ్. కానీ ఎంట‌ర్‌టైనింగ్‌గా చేశాం. త‌ప్ప‌కుండా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను  సాలిడ్‌గా ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు.
 
నిర్మాత రవి శంకర్ శాస్త్రి జూమ్‌లో మాట్లాడుతూ ‘‘మా టీమ్ కోసం వ‌చ్చిన త్రివిక్ర‌మ్‌గారికి థాంక్స్‌. పెద్ద‌మ్మమ్మ‌గారితో ఉండే అనుబంధం కార‌ణంగా నాకు చిన్న‌ప్పుడు సినీ ఇండ‌స్ట్రీతో ప‌రిచయం ఉండింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాను. అయితే మంచి స‌పోర్ట్ దొరికింది. సుశాంత్ అంద‌గాడే కాదు, తెలివైనవాడు, బాగా క‌ష్ట‌ప‌డ‌తాడు. త‌న ఎఫ‌ర్ట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఆగ‌స్ట్ 27న విడుద‌లవుతున్న మా ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాను స‌క్సెస్ చేయాలి’’ అన్నారు.
 
నిర్మాతఏక్తా శాస్త్రి మాట్లాడుతూ ‘‘త్రివిక్రమ్‌గారికి థాంక్స్‌. సుశాంత్‌, ద‌ర్శ‌న్‌, మీనాక్షి స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు. ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌వుతున్న సినిమాను అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ, నా పాట‌ల ర‌చ‌యిత‌కు, రోల్ రైడాకు థాంక్స్‌. ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌తో చాలా మంచి జర్నీ. చాలా మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకున్నాడు. త‌న‌కు మంచి మ్యూజిక‌ల్ సెన్స్ ఉంది. త‌ను భ‌విష్య‌త్తులో పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు. ఈ జ‌ర్నీలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.
 
నిర్మాత హ‌రీశ్ మాట్లాడుతూ ‘‘రవిశంకర శాస్త్రిగారు, ఏక్తాగారు, సుశాంత్‌గారి లెగ‌సీస్ ఏంటో తెలుసు. అలాంటి వాళ్లు చేసే సినిమాలో నేను భాగం కావ‌డం అనేది చాలా గౌర‌వంగా, అదృష్టంగా భావిస్తున్నాం. ర‌విగారు, ఏక్తాగారు.. సినిమా రేంజ్‌ను పెంచారు. కొత్త‌వాళ్ల‌ను న‌మ్మి మాకు స‌పోర్ట్ చేశారు. సుశాంత్‌గారు స‌హా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. కొత్త సుశాంత్‌ను చూస్తారు. త‌న‌లో చాలా ఫైర్ ఉంటుంది. ఈ సినిమా త‌ర్వాత త‌న‌కు చాలా కొత్త సినిమాలు వ‌స్తాయి’’ అన్నారు.
 
హీరోయిన్ మీనాక్షి చౌద‌రి మాట్లాడుతూ ‘‘తొలి సినిమా కావ‌డంతో కాస్త నెర్వ‌స్‌గా ఫీల్ అయ్యాను. అయితే నిర్మాతలు రవిగారు, ఏక్తాగారు, హ‌రీశ్‌గారి వ‌ల్ల మ‌న అనే భావం ఎక్క‌వగా క్రియేట్ అయ్యింది. టాలెంటెడ్ టీమ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నీ ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు.
 
యాక్ట‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ ‘‘రెండు పాండమిక్స్, లాక్‌డౌన్స్‌ను త‌ట్టుకుని ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్న నిర్మాత‌ల‌కు థాంక్స్‌. అలాగే న‌న్ను మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తున్న ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్ గారికి, నిర్మాత హ‌రీశ్ గారికి కూడా థాంక్స్‌. ఈ సినిమా సుశాంత్‌కు చాలా పెద్ద హిట్ కావాల‌ని అనుకుంటున్నాను. 2018 మిస్ ఇండియా అయిన మీనాక్షి చౌద‌రి ఈ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కావ‌డం చాలా హ్యాపీ. అభిన‌వ్‌, ప్రియ‌ద‌ర్శి, కృష్ణ‌చైత‌న్య‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.
 
శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ ‘‘నిర్మాత హరీశ్ నాకు మంచి స్నేహితుడు. నాకు ఎంతో న‌చ్చిన స్నేహితులు ఈ సినిమాలో ఉన్నారు. సుశాంత్‌తో మంచి అనుబంధం ఉంది. చాలా మంది ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నారు. సినిమా చూడ‌టానికి ఈ నెల 27న బండి తీయాల‌ని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
 
న‌టుడు కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ ‘‘ప్రతి ఆర్టిస్ట్‌కు త‌న టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాల‌ని క‌సి ఉంటుంది. నాకు అలాంటి అవ‌కాశం ఈ సినిమాతో ద‌క్కింద‌ని అనుకుంటున్నాను. ఇలాంటి క్యారెక్ట‌ర్‌ను నాకు ఇచ్చిన ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌, నిర్మాత హ‌రీశ్‌గారికి థాంక్స్‌. అక్కినేని హీరో అయిన సుశాంత్‌గారితో క‌లిసి న‌టించ‌డం హ్యాపీగా అనిపించింది. త‌ను ఇచ్చిన స‌పోర్ట్‌తో నా క్యారెక్ట‌ర్‌ను ఇంకా ఈజ్‌తో చేశాను’’ అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ‌ముఖిని భ‌ర్త‌గా హ‌క్కుతో లాగి కొట్టిన అవినాష్