Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

Advertiesment
Rashmika_Vijay

ఠాగూర్

, మంగళవారం, 11 నవంబరు 2025 (19:41 IST)
స్టాక్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా నటించిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండు అతిథిగా హాజరుకానున్నట్టు ప్రచారం సాగుతోంది. 
 
కాగా, రష్మిక మందన్నాతో విజయ్ దేవరకొండ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం త్వరలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో 'ది గర్ల్ ఫ్రెండ్' సక్సెస్ మీట్ హైదరాబాద్ నగరంలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరుగనుంది. దీనికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. 
 
పైగా, ఈ వార్త బయటకు రావడంతో విజయ్ - రష్మిక అభిమానుల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఈ వేదికపైనే వారిద్దరూ తమ పెళ్ళి తేదీని ప్రకటించి అందరికీ శుభవార్త చెప్పబోతున్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా? లేక ఇందులో నిజం ఉందా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్