టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నిర్వహించిన 'రెట్రో' ప్రీరిలీజ్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఆదివాసీలను అవమానించేలా ఉన్నాయని మండిపడుతున్నాయి.
దీనిపై ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు చాలాచోట్లు ఆ సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసింటీ సెక్షన్లపై కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్లు వారు వివరించారు.
తమిళ హీరో సూర్య నటించిన 'రైట్రో' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం వాళ్లే మీద ఎటాక్ చేస్తారన్నారు.
కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే, 500 ఏళ్ల క్రితం ట్రైబల్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమిష్టి కలిసి ఉండాలి అని అన్నాడు. విజయ్ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడాలని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ కిషన్ సహా గిరిజన్ సంఘాలు తప్పుబట్టాయి.