Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్‌తో ''సాహో''.. వరుణ్‌ధావన్‌తో శ్రద్ధా కపూర్ బిజీ బిజీ

''సాహో'' హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఈ సినిమా కోసం భారీ పారితోషికం సంపాదించింద. టాలీవుడ్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ''సాహో" పేరు మార్మోగిపోతోంది. బాహుబ‌లి సిరీస్‌తో వ‌చ్చిన ప్ర‌భాస్ ఇమేజ్‌ని కాపాడటమే లక్ష్య

ప్రభాస్‌తో ''సాహో''.. వరుణ్‌ధావన్‌తో శ్రద్ధా కపూర్ బిజీ బిజీ
, ఆదివారం, 31 డిశెంబరు 2017 (15:01 IST)
''సాహో'' హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఈ సినిమా కోసం భారీ పారితోషికం సంపాదించింద. టాలీవుడ్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ''సాహో" పేరు మార్మోగిపోతోంది. బాహుబ‌లి సిరీస్‌తో వ‌చ్చిన ప్ర‌భాస్ ఇమేజ్‌ని కాపాడటమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో నటించే ప్రభాస్, శ్రద్ధాకపూర్‌కు విడుదలకు ముందే మంచి క్రేజ్ వచ్చింది. సాహోలో చేస్తూనే శ్రద్ధా కపూర్ గ్యాప్‌లో బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న శ్రద్ధా కపూర్ నాయిక‌గా న‌టిస్తోంది.
 
క్రేజీ యంగ్ హీరో వ‌రుణ్‌ధావ‌న్ `జుడ్వా 2`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. జుడ్వా -2 ఈ హీరోని 100 కోట్ల క్ల‌బ్‌లో నిల‌బెట్టింది. అదే హుషారులో ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అక్టోబ‌ర్‌, సుయ్ ధాగ్ చిత్రాల‌తో పాటు "న‌వాబ్‌జాదే" అనే సినిమాలోనూ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ శ్రద్ధాకపూరే. ఇంతకుముందే.. శ్ర‌ద్ధా- ధావ‌న్ కాంబినేష‌న్‌లో ఏబీసీడీ-2 సినిమా వచ్చింది. 
 
ఈ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. తాజా సినిమాలో వీరిద్దరి కాంబోలో సినిమా హిట్ కాక తప్పదని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాట స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమ్మేస్తున్న ఎంసీఏ కలెక్షన్లు: ఎనిమిది రోజుల్లో రూ.30కోట్లు?