Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాట‌తో పునః ప్రారంభమైన వరుడు కావలెను

పాట‌తో పునః ప్రారంభమైన వరుడు కావలెను
, గురువారం, 24 జూన్ 2021 (12:17 IST)
Ritu, naga sowrya
నాగ శౌర్య న‌టిస్తున్న ‘వరుడు కావలెను‘ గురువారంనాడు హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మ‌య్యాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. నాగ శౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. చిత్ర నాయకా, నాయికలు నాగ శౌర్య ,రీతువర్మ లపై ఓ సందర్భోచిత గీతాన్ని నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ నేతృత్వంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చిత్రీకరిస్తున్నారు. ఈ గీతం తో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.
 
చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇంకా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
 
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్  సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌, నిర్మాత: సూర్య దేవర నాగవంశి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య,

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత కష్టం పండింది.. వరల్డ్ రికార్డు కొట్టిన ఫ్యామిలీ మ్యాన్ 2