Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ కొండపొలం : ఉప్పెన తర్వాత

వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ కొండపొలం : ఉప్పెన తర్వాత
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:09 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలా వేసుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన నటించే రెండో చిత్రానికి "కొండపొలం" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా, క‌రోనా వైరస్ కారణంగా ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. 
 
అడవి నేపథ్యంలో సాగే ఈ మూవీని ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. అక్టోబ‌ర్ 8న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ రీసెంట్‌గా ప్ర‌క‌టించారు.
 
తాజాగా చిత్రానికి "కొండ పొలం" అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో వైష్ణ‌వ్ తేజ్ మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. తొలి సినిమాలో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న వైష్ణ‌వ్‌తేజ్ రెండో సినిమాతోను అల‌రిస్తాడ‌ని చెబుతున్నారు. 
 
‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న కారణంగా ఈ సినిమాకి అదే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అడవి జంతువులూ తిరిగే చోట నీరు కూడా దొరకని పరిస్థితుల్లో రైతు జీవనం ఎలా సాగింది అన్న కథతో ఈ సినిమా వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 27న 'సోని లివ్' ఓటీటీలో "వివాహ భోజనంబు" స్ట్రీమింగ్