Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నన్ను అత్యాచార సన్నివేశంలో నటించమన్నారు.. భయమేసి పారిపోయా..

నన్ను అత్యాచార సన్నివేశంలో నటించమన్నారు.. భయమేసి పారిపోయా..
, శుక్రవారం, 15 నవంబరు 2019 (14:49 IST)
దేశ వ్యాప్తంగా ''మీటూ'' సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా కొందరు హీరోయిన్లు గతంలో తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. తాజాగా ఉజ్జా చమన్  హీరోయిన్ మాన్వి గగ్రూ తానెదుర్కొన్న అనుభవం గురించి తాజాగా వెల్లడించింది. ఓ సినిమాలో అవకాశం కోసం నేను ఆడిషన్స్‌కు వెళ్లాను. ఆడిషన్స్‌లో భాగంగా నన్ను అత్యాచార సన్నివేశంలో నటించమని అడిగారు
 
ఆ సీన్‌లో బాగా నటిస్తే సినిమాలో అవకాశం కల్పిస్తామన్నారు. అక్కడి గదిలో మంచం ఉంది. దాని పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అక్కడి వాతావరణం చూసి నాకు భయమేసింది. దాంతో నేను వెనక్కి తిరిగి చూడకుండా బయటకు పరుగులు పరుగుతీశాన'ని మాన్వి చెప్పింది.
 
ఇకపోతే.. మాన్వి ''ఉజ్జా చమన్'' చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఎక్కువ బరువు, లావుగా ఉన్న అమ్మాయిగా కనిపించిన మాన్వి బట్టతల ఉన్న హీరోను ఇష్టపడే అమ్మాయిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సన్నీసింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ పాథక్ దర్శకత్వం వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను అలా చేసే వారంటే బాగా ఇష్టపడతా: రాశీ ఖన్నా