Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ బారినపడిన మరో ఇద్దరు సింగర్స్... ఎవరువారు?

కరోనా వైరస్ బారినపడిన మరో ఇద్దరు సింగర్స్... ఎవరువారు?
, మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:25 IST)
ఇప్పటికే గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ బారినపడి ప్రాణాపాయస్థితిలో స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు ఆయన సోదరి, గాయని ఎస్.పి.శైలజ చెప్పారు. అయినప్పటికీ ఎస్.పి.బి ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో ఇద్దరు గాయనీమణులు ఈ వైరస్ బారినపడ్డారు. వారు ఎవరో కాదు.. సునీత, మాళవిక. 
 
వీరిద్దరూ ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ వైరస్ బారినపడినట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల వీరికి క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ అయింది. ఆ కార్య‌క్ర‌మంలోనే క‌రోనా సోకింద‌ని మా వ‌ర్గాల స‌మాచారం. ఎందుకంటే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న‌ చాలామందికి క‌రోనా వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 
 
కాగా, తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేకమంది సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, నాగవంశీలతో పాటు.. దర్శకుడు తేజ, మరికొందరు సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరి డైరెక్షన్లో నాగ్ మూవీ నిజమేనా..?