Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై చంద్రంకు అరబ్ ఎమిరేట్స్ 'గోల్డెన్ వీసా'

చెన్నై చంద్రంకు అరబ్ ఎమిరేట్స్ 'గోల్డెన్ వీసా'
, గురువారం, 4 నవంబరు 2021 (18:59 IST)
సౌత్ ఇండియన్ నటి, చెన్నై చంద్రం త్రిష‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. ఫలితంగా ఈ వీసా అందుకున్న తొలి తమిళనటిగా త్రిష రికార్డు సాధించింది. 2019 నుండి యూఏఈ ప్ర‌భుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేస్తుండ‌గా, తాజాగా ఇది త్రిష‌కు ద‌క్కింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటి ఈమె కావడం గమనార్హం. 
 
ఈ వీసా క‌లిగిన వారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. గెల్డెన్ వీసాలను ఐదేళ్లు లేదంటే 10 ఏళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వాటంతట అవే రెన్యువల్ అవుతాయి. యూఏఈ గోల్డెన్ వీసా పొందిన విషయాన్ని త్రిష స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 
 
కాగా, గతంలో ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీకపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమాల్ మల్లిక్, మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ నేపథ్య గాయని కేఎస్ చిత్ర వంటివారు ఇప్పటి వరకు యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్యావరణ ప్రేమికులకు కంగనా క్లాస్.. 3 రోజులు కారు వాడొద్దు..