Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నటీనటులకు సిగ్గూఎగ్గూలేదు.. థూ... : నవాజుద్దీన్ మండిపాటు

నటీనటులకు సిగ్గూఎగ్గూలేదు.. థూ... : నవాజుద్దీన్ మండిపాటు
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:44 IST)
నటీనటులపై బాలీవుడ్ నటు నవాజుద్దీన్ మండిపడ్డారు. దేశంలో కరోనా వైరస్ సునామీ సంభవించివుంటే కొందరు నటీనటులు వివాహర యాత్రలకు వెళ్లి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
 
'ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో పడింది. వీళ్లు మాత్రం విహార యాత్రలకు వెళుతున్నారు. మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ, ఫొటోలను షేర్‌ చేయటంలో బిజీగా ఉన్నారు. వీళ్లు చేసే తమాషా ఏంటో నాకు అర్థం కావటం లేదు. ప్రజలు తిండి దొరక్క ఇబ్బంది పడుతుంటే... డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
ఈ మధ్యకాలంలో బాలీవుడు సెలెబ్రిటీలు శ్రద్ధా కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌, టైగర్‌ ష్రాఫ్‌-దిశా పటానీ, మాధురీ దీక్షిత్‌, జాన్వీ కపూర్‌ తదితరులు కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత మాల్దీవులు వెళ్లొచ్చారు. ఇప్పటికే వీళ్ల తీరును హిందీ నటుడు అమిత్‌ సాద్‌, హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌ తప్పుపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు శ్రీ‌కాంత్‌తో ఇప్పుడు ఆయ‌న కొడుకుతో`పెళ్లిసంద‌D`