Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అది చూస్తే మహేష్ బాబు కుళ్లుకుంటాడు... ఎన్టీఆర్ లారీ అక్షింతలు చల్లుతాడు...

తను తీయబోయే చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తీస్తున్నారని అనుకున్నారేమోగానీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌ను వాడారు. లక్ష్మీస్ వీరగ్రంథం తీస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ.

అది చూస్తే మహేష్ బాబు కుళ్లుకుంటాడు... ఎన్టీఆర్ లారీ అక్షింతలు చల్లుతాడు...
, బుధవారం, 1 నవంబరు 2017 (12:47 IST)
తను తీయబోయే చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తీస్తున్నారని అనుకున్నారేమోగానీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌ను వాడారు. లక్ష్మీస్ వీరగ్రంథం తీస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ... ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే 100 రెట్లు ఎక్స్‌టార్డినరీ స్క్రీన్ ప్రెజెన్స్ వుందనీ, ఆయన్ని చూస్తే ప్రిన్స్ మహేష్ బాబు సైతం కుళ్లుకుంటారని ట్వీట్ చేశారు. 
 
లక్ష్మీస్ వీరగ్రంథంలో వీరగంధం పాత్రలో కేతిరెడ్డి నటిస్తే చిత్రం బ్లాక్‌బస్టర్ ఖాయమవుతుందని వర్మ పేర్కొన్నారు. వీపు సుందరితో కేతిరెడ్డి నటిస్తుంటే దాన్ని చూసి స్వర్గీయ ఎన్టీఆర్ సైతం ఉబ్బితబ్బిబ్బయి ఓ లారీడు అక్షింతలు తీసుకుని వచ్చి ఆయనపై చల్లుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరికను ఓ స్థాయిలో ఎత్తేశారు. ఈ సందర్భంగా బాహుబలి చిత్రాన్ని వాడుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాహుబలి అనీ, ఆయన చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వర్షం కురుస్తుందని వెల్లడించారు. వ్యవహారం చూస్తుంటే రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంపై కుళ్లుకుంటున్నట్లు కనబడటం లేదూ...?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.3 కోట్ల అపరాధమా?.. అది గాలివార్త : లావణ్య త్రిపాఠి