Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్

బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్
, శనివారం, 24 అక్టోబరు 2020 (12:56 IST)
బాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? డైరెక్టర్ అశోక్. తెలుగులో ఆకాశరామన్న, పిల్ల జమీందార్, భాగమతి చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. భాగమతితో బిగ్ సక్సెస్ సాధించిన అశోక్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు.
 
ఈ చిత్రాన్ని హిందీలో దుర్గావతిగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో భూమీ పడ్నేకర్ టైటిల్ రోల్ చేస్తోంది. చిత్రీకరణ తుది దశలో ఉంది. అక్షయ్ కుమార్ సమర్పణలో భూషణ్ కుమార్, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుంది. ఈ సినిమా ఇంకా ఫినిష్ కాలేదు.. ఇంకా రిలీజ్ కాకుండానే బాలీవుడ్లో మరో ఆఫర్ దక్కించుకున్నాడు.
 
అయితే.. ఈ ప్రాజెక్ట్ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇంతకీ.. ఏంటా ప్రయోగం అంటే ఇది పూర్తిగా మూకీ సినిమా. అంటే.. నటనే తప్ప డైలాగ్స్ ఉండవు. గతంలో కమల్ హాసన్ చేసిన పుష్పక విమానం సినిమా తరహాలో ఉంటుందన్న మాట. ఈ సినిమాని తెలుగులో చేయాలి అనుకున్నారు. వెంకీతో చేయడానికి ప్లాన్ చేసారు కానీ.. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.
 
ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సోహమ్‌ షా, నుష్రత్, ఓంకార్‌ కపూర్, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇది కూడ ఒక ప్రముఖ ఓటీటీ కోసం రూపొందిస్తున్న సినిమా అని సమాచారం. మరి.. ఈ చిత్రాన్ని హిందీలోనే తీస్తారా..? లేక సౌత్ లాంగ్వేజెస్‌లో కూడా తీస్తారా..? అనేది తెలియాల్సివుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధేశ్యామ్ సినిమా స్టోరీ లీక్.. క్లైమాక్స్ అలా వుంటుందా?