Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంగనా రనౌత్‌కు ప్రైవ‌సీ క‌ల్పించిన జ‌డ్జి

Advertiesment
Kangana Ranaut
, మంగళవారం, 5 జులై 2022 (19:02 IST)
Kangana Ranaut
కంగనా రనౌత్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతిందని జావేద్ అక్తర్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ఆయ‌న ఆరోపించారు. నవంబర్ 2020లో అక్తర్ ఆమెపై ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కోర్టుకు హాజరు కావడం ఇది మూడోసారి.
 
నటి కంగనా రనౌత్ సోమవారం సబర్బన్ అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుకు సంబంధించి ఆమె హాజ‌ర‌య్యారు. ముందుగా ఆమె జ‌డ్జితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్టాడుతూ త‌న‌కు ప్రైవ‌సీ కావాల‌ని కోరారు. అందుకు జ‌డ్జి మీడియాను, విలేక‌రుల‌ను పంపించేసి ఆమెకు ప్రైవ‌సీని క‌ల్పించారు.
 
ఇక దీనిపై సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత ప్రైవ‌సీ అవ‌స‌ర‌మా! అని కొంద‌రంటే, న్యాయ‌స్థానం రూల్స్ ప్ర‌కారమే కంగ‌నా అడిగింద‌నీ, ఆమె లాయ‌ర్ స‌మ‌యానుకూలంగా ఆలోచ‌న క‌లిగించార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈనెల 20న ఫైన‌ల్ తీర్పురానుందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది మేరేజ్ రింగ్ కాదు- నేనే కొనుక్కున్నా - లావణ్య త్రిపాఠి