పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే తెలుగు సినిమాలో కనిపించి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ కాంబినేషన్ లో అలరించింది. ఇక ఆ తర్వాత చివరి సినిమా ఆచార్య. ఆ సినిమా నిరాశపరిచిన తర్వాత, ఆమె బాలీవుడ్ వైపు దృష్టి సారించి, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో హై-ప్రొఫైల్ ప్రాజెక్టులపై పనిచేసింది.
తాజాగా, ఆమె సూర్య సరసన తమిళ చిత్రం రెట్రో లో నటించింది. మే 1న సినిమా విడుదలకాబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రమోషన్లను ప్రారంభించింది, ఇది ఇప్పటికే అభిమానులలో గణనీయమైన సంచలనాన్ని సృష్టిస్తోంది. తెలుగు సినిమా నుండి తాను దూరంగా ఉన్నానని ప్రస్తావిస్తూ, "నా అంచనాలకు సరిపోయే సరైన స్క్రిప్ట్ నాకు దొరకడం లేదు. అందుకే గేప్ తీసుకున్నానంటూ... ఇటీవలే కొత్త తెలుగు ప్రాజెక్ట్పై సంతకం చేశానని ఆమె ధృవీకరించింది, అయితే ప్రస్తుతానికి ఆమె వివరాలను గోప్యంగా ఉంచుతోంది. "నేను దానిని సరైన సమయంలో ప్రకటిస్తాను" అని చిరునవ్వుతో వ్యక్తీకరించింది.
కాగా, అల్లు అర్జున్ తాజా సినిమాలో ఆమె నటించనుందనే వార్తలు ఇటీవలే షికారు చేశాయి. రామ్ చరణ్ తో కూడా నటించబోతోందని కూడా వార్తలు వచ్చాయి. మరి ఏ సినిమాలో నటిస్తుందో చూడాలి.