Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Advertiesment
Maduram team with vinayak

దేవీ

, బుధవారం, 16 ఏప్రియల్ 2025 (11:19 IST)
Maduram team with vinayak
ఉదయ్ రాజ్,  వైష్ణవి సింగ్ జంటగా రాజేష్ చికిలే దర్శకత్వంలో యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం.  ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను  డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు.

అనంతరం డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు  ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధురం చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదయ్ రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి,  మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని చెప్పారు. 
 
ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ, ‘‘‘మధురం’ ట్రైలర్ చాలా బాగుంది. టీనేజ్ లవ్ స్టోరీ చూడగానే నా ఫ్లాష్​బ్యాక్‌ గుర్తొచ్చింది.  2008లో  నేను ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా ‘అందమైన మనసులో’. అది పదమూడేళ్ల అమ్మాయి లవ్ స్టోరీ.  ఆ టైమ్‌లో సినిమా చూసినవాళ్లంతా పదేళ్లు తర్వాత రావాల్సిన సినిమా అన్నారు. అలాంటి కాన్సెప్ట్‌తోనే ఇప్పుడు ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రయోగాత్మక ప్రేమకథలు రూపొందించడం కత్తిమీద సాములాంటిది. కానీ ట్రైలర్ చూశాక ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యిందని అనిపించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేస్తే బంగార్రాజు లాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వస్తారు అని అన్నారు. 
 
రఘుకుంచె మాట్లాడుతూ, 90స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ స్టోరీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉదయ్ రాజ్ హీరోగా మరిన్ని పెద్ద సినిమాలు చేయాలి. తనతోపాటు టీమ్ అందరికీ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. 
 
దర్శకులు  విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ ‘‘ఈ టైటిల్ ఎంత మధురంగా ఉందో.. సినిమా కూడా అంతే మధురంగా ఉంటుంది. తొంభైల కాలంలోని  స్వచ్ఛమైన ప్రేమను ఇందులో చూపిస్తున్నారు. ప్రేక్షకులకు చక్కని అనుభూతిని కలిగిస్తుంది. పాటలన్నీ చాలా వినసొంపుగా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ బాగా పెర్ఫార్మ్ చేశారు. టీమ్ అందరికీ ఈ చిత్రం మధురమైన హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా”అని అన్నారు. 
 
హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ,  డైరెక్టర్ రాజేష్​ వెరీ హార్డ్ వర్కర్. నైంటీస్ కథ కావడంతో చాలా కేర్ తీసుకుని రూపొందించారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అద్భుతమైన సంగీతం అందించారు. డీవోపీ మనోహర్ గారు చక్కని విజువల్స్ ఇచ్చారు. ఈ చిత్రం ఆడియెన్స్‌ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది”అని చెప్పారు. 
 
దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ, ఈ కథను ఎంత బాగా రాసుకున్నానో అలా హీరో ఉదయ్, హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించారు. కెమెరామేన్ మనోహర్ గారు మంచి విజువల్స్ అందించారు. వెంకీ వీణ సంగీతం అందర్నీ అలరిస్తుంది. ప్రొడ్యూసర్ బంగార్రాజు గారు చేసిన సపోర్ట్‌తో బెస్ట్ అవుట్‌పుట్ వచ్చింది అని చెప్పారు. 
 
హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ.."ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులోని నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది.  ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు.  ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో  అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు. 
 
నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చాలా మధురంగా ఉంటుంది. కొత్త నిర్మాతను అయినా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. అలాగే మా ట్రైలర్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి ధన్యవాదాలు”అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?