Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని చెలామణి అవుతున్నారు : తమ్మారెడ్డి

సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్.టి. రామారావు బొమ్మ పెట్టుకుని చలామణి అవుతున్నారనీ, ఆయన ఆశయాలను నిలబెట్టే ప్రయత్నం చేయడం లేదనీ ఆయన ఆరోపించారు.

ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని చెలామణి అవుతున్నారు : తమ్మారెడ్డి
, శుక్రవారం, 19 జనవరి 2018 (12:55 IST)
సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్.టి. రామారావు బొమ్మ పెట్టుకుని చలామణి అవుతున్నారనీ, ఆయన ఆశయాలను నిలబెట్టే ప్రయత్నం చేయడం లేదనీ ఆయన ఆరోపించారు. ఇప్పటికీ, ఆ వీడియో చూస్తే.. జనాల్లో నేను కూర్చుని ఉంటాను. ఆయన (ఎన్టీఆర్) ఆరోజు ఆవేదన పడ్డారు. ఆ తర్వాత ఓ వారం రోజులో లేదా పదిరోజులో బ్రతికి ఉన్నట్టున్నారు. 
 
ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన్ని కాదన్నవాళ్లు, ఆయన పోయిన తర్వాత ఆయన బొమ్మ పెట్టుకుని, ఆయన పేరుతోనే చెలామణి అవుతున్న చాలా మంది ఇప్పుడు ఉన్నారు. ఎన్టీఆర్ పేరుతో చెలామణి అవడం తప్పని నేను అనను. కానీ, ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టేందుకు ప్రయత్నం చేయడం లేదని గట్టిగా చెబుతున్నాను. సామాన్యులు, కర్షకులు, కార్మికులు, మహిళల కోసం ఎన్టీఆర్ ఎంతో ఆలోచించారు.. ఎంతో చేశారు. కానీ, ఈరోజుకీ ఎన్టీఆర్‌కి 'భారతరత్న' రాలేదు.. రాదేమోకూడా!' అని ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అజ్ఞాతవాసి'కి కష్టాలు... నోటీసులివ్వనున్న ఫ్రెంచ్ దర్శకుడు