Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మకు స్వర్గంలో మరో సింహాసనం ఎదురుచూస్తోంది.. త్రిష ట్వీట్

హీరోయిన్‌గా సినీరంగంలో వెలుగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించి విప్లవ కథానాయకిగా కీర్తి గడించిన అలనాటి అందాల తార జయలలితకు తమిళ సీని రంగ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. ముఖ్యంగా తమిళ సినీ అగ్

Advertiesment
అమ్మకు స్వర్గంలో మరో సింహాసనం ఎదురుచూస్తోంది.. త్రిష ట్వీట్
, మంగళవారం, 6 డిశెంబరు 2016 (10:13 IST)
హీరోయిన్‌గా సినీరంగంలో వెలుగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించి విప్లవ కథానాయకిగా కీర్తి గడించిన అలనాటి అందాల తార జయలలితకు తమిళ సీని రంగ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. ముఖ్యంగా తమిళ సినీ అగ్ర కథానాయికలు అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు. గౌతం వాసు దేవ్ మీనన్, రాధిక, త్రిష, శృతి హాసన్ తదితరులు ఆమెకు నివాళులర్పించినవారిలో వున్నారు.
 
స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని హీరోయిన్ త్రిష ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అనీ సంతాపం ప్రకటించారు. ఆమెను కలవడం అదృష్టమనీ, చాలా గర్వంగా ఉందంటూ జయలలిత కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. 
 
తమిళనాడుకేకాదు... యావత్ భారతదేశానికే సాహస పుత్రిక అని సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా అమ్మ మృతికి సంతాపం తెలిపారు. బల్గేరియాలో షూటింగ్‌లో అజిత్ కుమార్ కూడా అమ్మ మృతికి సంతాపం ప్రకటించారు. జీవితంలోని అనేక యుద్ధాల్లో పోరాడాతూ ధైర్యంగా నిలబడ్డారనీ, ఈ సమయం ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ దైవం ప్రసాదించాలంటూ ట్వీట్ చేశారు. 
 
అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలిలత ఒకరని శ్రుతిహాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు ఒక సాహసోపేతమని మహిళా నాయకురాలని కోల్పోయిందని,ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమ్మ'కు నివాళులు తెలిపిన ముకేశ్ అంబానీ, నాగార్జున, మోహన్ బాబు, బాలకృష్ణ