Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజు గారి గ‌ది 3లో న‌టించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?

రాజు గారి గ‌ది 3లో న‌టించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?
, మంగళవారం, 12 మార్చి 2019 (22:07 IST)
జీనియ‌స్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారిన‌ యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్. ఆత‌ర్వాత ఓంకార్ తెర‌కెక్కించిన హ‌ర్ర‌ర్ కామెడీ మూవీ రాజు గారి గ‌ది. 2015లో రిలీజైన ఈ సినిమాలో అశ్విన్ బాబు, ధ‌న్య‌బాల‌క్రిష్ట‌న్, ధ‌న‌రాజ్, రాజీవ్ క‌న‌కాల ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

హ‌ర్ర‌ర్ కామెడీతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించిన ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో మంచి విజ‌యాన్నిసాధించింది. ఆ త‌ర్వాత ఈ క‌థ‌కు సంబంధం లేక‌పోయినా రాజు గారి గ‌ది 2 టైటిల్‌తో ఓంకార్ మ‌రో సినిమా తెర‌కెక్కించారు. ఇందులో నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. 
 
పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఓఏకే ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. 2017లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజు గారి గ‌ది 2 ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆత‌ర్వాత సినిమాల‌కు కొంత గ్యాప్ ఇచ్చి ఓంకార్ టీవీ షోలో బిజీ అయ్యారు. తాజాగా ఇప్పుడు రాజు గారి గ‌ది 3 సినిమా తీయ‌డానికి ఓంకార్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. 
 
ఇటీవ‌ల ఓంకార్ త‌మ‌న్నాకి క‌థ చెప్ప‌డం..క‌థ విని త‌మ‌న్నా ఓకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తమ‌న్నా వేరే సినిమాల్లో బిజీగా ఉంది. త‌మ‌న్నా డేట్స్ విష‌యంలో క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత రాజు గారి గ‌ది 3 చిత్రాన్ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి...ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త గురించి ఓంకార్ స్పందిస్తాడేమో చూద్దాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూ.ఎన్టీఆర్‌లా స్టెప్ వేయాలని చతికిలబడ్డ తమిళ హీరో...