Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదేశీ గడ్డపై నుంచి "సైరా" ట్రైలర్ రిలీజ్!?

విదేశీ గడ్డపై నుంచి
, ఆదివారం, 28 జులై 2019 (15:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార వంటి అనేక మంది అగ్ర నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. 
 
తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై హీరో రాంచ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. వచ్చే అక్టోబరు రెండో తేదీన గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంద‌నే టాక్ వినిపిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌తో ఇతర గ్రాఫిక్స్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. 
 
అయితే, చిత్రంలో బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన ఒప్పందాలకి సంబంధించిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తాయ‌ని అంటున్నారు. చిత్ర ట్రైల‌ర్ ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తుండ‌గా, తాజాగా ఓ వార్త బ‌య‌టికి వచ్చింది. 
 
ఆగస్టు 15, 16వ తేదీల్లో సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ సమయంలోనే సైరా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. హిందీతో పాటు సౌత్‌లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్‌ని ఇలాంటి అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రమోట్ చేయడం సినిమాకు అనుకూలించే అంశమే అని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బన్నీపై నెగెటివ్ ప్రచారం : ప్రియమైన అదృశ్య శత్రువు...