Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ లియోనే ఔదార్యం.. కేన్సర్ రోగులకు అండగా...

సన్నీ లియోనే ఔదార్యం.. కేన్సర్ రోగులకు అండగా...
, ఆదివారం, 6 అక్టోబరు 2019 (16:57 IST)
బాలీవుడ్ బ్యూటీ, పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఔదార్యం ప్రదర్శించారు. కేన్సర్ బారినపడివున్న రోగులను ఆదుకునేందుకు ఆమె తన పెయింటింగ్స్‌ను వేలం వేసేందుకు ముందుకు వచ్చారు.
 
కుంచె చేత ప‌ట్టుకొని పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్‌ని వేలం వేయ‌మ‌ని ఇచ్చారు. ఆ వ‌చ్చిన మొత్తాన్ని కేన్స‌ర్ రోగుల చికిత్స కోసం ఉప‌యోగించ‌నుంది. స‌న్నీ లియోన్ తండ్రి కేన్స‌ర్ వ్యాధితో సన్నీ మ‌ర‌ణించిన కార‌ణంగా ఆమె ఈ నిర్ణ‌యం తీసుకుంది. 
 
ఒక్కరిలోనైనా అవగాహన తీసుకురాగలిగినా, ఒక్కరి చికిత్సకు అవసరమైన డబ్బులు సమకూర్చగలిగినా... కేన్సర్‌పై యుద్ధంలో చిన్న విజయం సాధించినట్టేనని సన్నీ లియోన్ అంటోంది.
 
"కుంచె చేత ప‌ట్టుకొని ప్ర‌తి గీత గీస్తున్న‌ప్పుడు నాన్న ఆలోచ‌న‌లే. ఆయ‌ని ఎంత‌గానో మిస్ అవుతున్నాను. నిధుల కోసం కాదు. కేన్స‌ర్‌పై యుద్దం చేస్తున్న వారిలో ధైర్యాన్ని నింపేందుకు నా జీవితంలో జ‌రిగిన విష‌యాల‌ని స్టోరీలుగా చెప్ప‌బోతున్నాను" అని సన్నీ అంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రమోషన్‌కు వచ్చిన చిత్రాలన్నీ ఫ్లాప్.. అందుకే వెళ్లడం లేదు: నయనతార