Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినకపోతే..?

Advertiesment
fruit
, గురువారం, 12 సెప్టెంబరు 2019 (11:36 IST)
పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని.. పొడిదుస్తులతో తుడిచేసి కట్ చేసి లాగించేస్తున్నారా? అయితే ఇక జాగ్రత్తపడండి. యాపిల్స్‌, ద్రాక్ష, చెర్రీస్‌, టమాటా, దోసకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, అరటి పండు ఇలా పలు రకాల పండ్లు, కూరగాయలకు రంగు వచ్చేందుకు, పండేందుకు రసాయనాలు వాడుతున్నారు. వాటిని తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, క్యాన్సర్‌ వంటి రోగాలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇలా శుభ్రం చేయని పండ్లను తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు ఇంటికి తెచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్ది సేపు నానబెట్టిన తరువాత గుడ్డతో తుడిచేసిన తరువాత వాటిని తినాలి. ఏ కాలంలో దొరికే పండ్లను అప్పుడే తినాలి. 
 
యాపిల్‌లో ఎక్కువగా మెరుపు కన్పిస్తే మైనపు పూత ఉన్నట్లే. గోటితో పండుపై గీకితే అంటుకుంటుంది. ఒకవేళ ఇంటికి తెచ్చినట్లైతే చాకుతో పైన చెక్కినా చాలు. అనుమానం ఉంటే పండుపై వేడి నీళ్లు పోస్తే తెలిసిపోతుంది. మైనపు పూత పోవాలంటే పండును బాగా కడగాలి. చాకుతో తొక్కను మొత్తం తీసి వేసి అప్పుడే తినాలి. లేదంటే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు మరింత ప్రమాదకరం. బాగా పండినవి, తొడిమ తొలగకుండా ఉన్న అరటి పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు 20 నుంచి నాట్స్ క్రికెట్ కప్... 20 ఇంజనీరింగ్ కాలేజీల మధ్య క్రికెట్ పోటీ