Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చూస్తూ ఉద్వేగానికి గురైన శ్రీముఖి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చూస్తూ ఉద్వేగానికి గురైన  శ్రీముఖి
, శనివారం, 26 ఫిబ్రవరి 2022 (12:52 IST)
Srimukhi, Mehr Ramesh
త‌న ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం “భీమ్లా నాయక్”ను చూసి ఫొటో షేర్ చేసింది శ్రీ‌ముఖి. అయితే సినిమా ర‌న్‌లో వుండ‌గా యాక్ష‌న్ సీన్ ఓ దానిని ఫొటో తీసి దానికి ఇద్ద‌రు ఫొటోలు జ‌త‌చేసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత ఆనంద‌నం పొంద‌డానికి కార‌ణం మెహ‌ర్ ర‌మేష్ సినిమా మెగాస్టార్ చిరంజీవి `భోళా శంకర్`లో శ్రీ‌ముఖి న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని కూడా నిన్న‌నే ఖ‌రారుచేసింది.
 
ఆ ఆనందంతోనే ద‌ర్శ‌కుడితో క‌లిసి సినిమా చూసిన‌ట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల ఎంతో ఎగ్జైట్ అవుతూండ‌గా, మ‌రోవైపు ఆ ద‌ర్శ‌కుడుతితో క‌లిసి ప‌వ‌న్ సినిమా చూడ‌డం మ‌రో విశేషం అంటూ పేర్కొంది. ఇదిలా వుండ‌గా, సినిమాలోని ఓ షాట్‌ను ఫొటో తీసి పెట్ట‌డంప‌ట్ల తాను సినిమా చూశాన‌నే క‌న్ ప‌ర్‌మేష‌న్ కోస‌మేనంటూ పేర్కొంది. లేదంటే త‌న‌ను అన‌వ‌స‌రంగా ప్ర‌చారం చేస్తారంటూ స‌ర‌దాగా చ‌లోక్లి కూడా వేసింది. శ్రీ‌ముఖి ఎక్క‌డున్నా చాలా బోల్డ్‌గానే వుంటుంది. ఇక ప‌వ‌న్ సినిమా చూస్తున్నంత‌సేపు చాలా లీన‌మైపోయింద‌ట‌. చివ‌రిలో రానాతో ఫైట్ ప‌వ‌న్ చేస్తుండ‌గా ఆయ‌న భార్య వ‌చ్చి వేడుకోవ‌డంతో చెల్లెలు కోసం ప్రాణ‌బిక్ష పెట్టిన స‌న్నివేశంలో ఉద్వేగానికి గురైంద‌ట శ్రీ‌ముఖి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'భీమ్లా నాయక్' టీం సక్సెస్ సెలెబ్రేషన్స్