అతిలోక సుందరి శ్రీదేవి తన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్ వేసింది. హాట్ సమ్మర్ నుంచి రిలీఫ్ అయ్యేందుకు శ్రీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇస్తాంబుల్, జార్జియాలకు వెళ్లింది. ఈ టూర్లో భాగంగా మంచు కొండల్లో తన భర్త బోనీకపూర్, ఇద్దరు కుమార్తెలు, జాహ్నవి, ఖుషీలతో దిగిన ఫోటోలు ఇన్స్స్టాగ్రామ్లో ప్రస్తుతం వైరల్గా మారాయి.
2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ప్రస్తుతం తన కుమార్తెను ప్రమోట్ చేయటంలో బిజీగా ఉంది. వయస్సు ఐదుపదులు దాటినప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్లో మంచి మార్కులు కొట్టేసిన శ్రీదేవి.. తన పెద్ద కుమార్తెను హీరోయిన్గా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. మంచి కథ, దర్శకుడు, నిర్మాత కోసం శ్రీదేవి అన్నీ కోణాల్లో పరిశీలనలు చేస్తోంది.
జాహ్నవికి తొలి సినిమానే హిట్ అవ్వాలని శ్రీదేవి జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే తన సినీ కెరీర్పైనా మంచి అవకాశాలను కైవసం చేసుకుని దూసుకెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం సమ్మర్ ట్రిప్ నుంచి తిరిగొచ్చాక ఇక పూర్తిస్థాయిలో సినిమా కెరీర్పై శ్రీదేవి దృష్టిపెట్టనున్నారని బీటౌన్ టాక్.