జనతా గ్యారెజ్ సెట్స్లో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ సందడి చేశారు. యూనిట్ సభ్యులతో అభయ్ కలసి ఆడుకుంటున్నట్లు గల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో.. సెట్స్కు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయుడు అభయ్ వచ్చారు. ఈ సెట్స్కు అభయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇంకా సమంత అభయ్ను ఎత్తుకున్న ఫోటోలకు మంచి క్రేజ్ వస్తోంది.
కాగా, సెట్స్కు తన భార్య, తనయుడు వచ్చిన ఆనందాన్ని తన అభిమానులతో ఎన్టీఆర్ పంచుకున్నారు. తన ఫేస్ బుక్ పేజీలో ముద్దుల కొడుకు సెట్స్లో హల్ చేసిన ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో అభయ్ ఫోటోలకు అభిమానుల నుంచి లైక్స్, షేర్లు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్.
ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఓ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ఆ సెట్కి సోమవారం ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ రావడం చిత్ర యూనిట్ను ఉత్సాహ పరిచింది. అభయ్ చాలాసేపు సెట్లో ప్రాపర్టీల్ని పట్టుకొని సందడి చేశాడు. ఆ ఫోటోలు మీకోసం..