Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#Mumbaielectricity సోనూ సూద్ ట్వీట్‌పై ప్రశంసలు.. ఏమన్నాడంటే?

#Mumbaielectricity సోనూ సూద్ ట్వీట్‌పై ప్రశంసలు.. ఏమన్నాడంటే?
, సోమవారం, 12 అక్టోబరు 2020 (19:51 IST)
దేశ వాణిజ్య నగరం ముంబైలో సోమవారం ఉదయం రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ.. విద్యుత్‌ శాఖను విమర్శించారు. తెగ కామెంట్లు చేయడంతో #Mumbaielectricity ట్యాగ్‌ ట్రెండింగ్‌ అయ్యింది.
 
దీంతో అమితాబ్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, అలీ ఫాజల్‌ తదితరులు ముంబై వాసుల్ని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు. దయచేసి మౌనంగా, ఓపికతో ఉండాలని కోరారు. అయితే ఈ విషయంపై సోనూసూద్‌ స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
 
ముంబైలో రెండు గంటల పాటు కరెంట్ లేదనే విషయం దేశానికి మొత్తం తెలిసిపోయింది. కానీ ఇవాల్టికి కూడా దేశంలోని అనే ఇళ్లకు కనీసం రెండు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదు. కాబట్టి దయచేసి ఓపికతో ఉండండని సోనూ పేర్కొన్నాడు.
 
అలా సమయోచితంగా ఆలోచించి సోనూ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన తీరుకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. విద్యుత్‌ సరఫరా రెండు గంటలపాటు ఆగిపోవడంతో నెట్టింట్లో విమర్శలతో పాటు నవ్వులు కూడా పూశాయి. నవ్వించే బాలీవుడ్‌ మీమ్స్‌ను రూపొందించి షేర్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్‌.. ఎద భాగాన్ని మొత్తం బయటపెట్టేసిన మోనాల్.. మరీ ఇంతలా దిగజారాలా?