Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Advertiesment
Sonu Sood

సెల్వి

, శుక్రవారం, 25 జులై 2025 (17:06 IST)
Sonu Sood
టాలీవుడ్ హాస్యనటుడు ఫిష్ వెంకట్ ఇటీవల తీవ్రమైన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మరణించారు. కుటుంబం ఎంత ప్రయత్నించినా, చికిత్స కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసినప్పటికీ, ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. గబ్బర్ సింగ్ బృందం, కొంతమంది వ్యక్తులు తప్ప, టాలీవుడ్ సినీ పరిశ్రమ వారి అవసరం సమయంలో ఎక్కువగా మౌనంగా ఉందని కుటుంబం గతంలో నిరాశ వ్యక్తం చేసింది. 
 
ప్రస్తుతం నటుడు సోను సూద్ ఫిష్ వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. బాధిత కుటుంబానికి రూ.1.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. భవిష్యత్తులో వారికి నిరంతర సహాయాన్ని అందిస్తామని హామీ ఇస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. 
 
ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్ చిత్రంలో కనిపించారు. సోను సూద్ రాకముందు, నటుడు విశ్వక్ సేన్ ఆ కుటుంబానికి సహాయం అందించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నటుడి చివరి రోజుల్లో ఆర్థిక సహాయం అందించారు. కిడ్నీ మార్పిడి కోసం కుటుంబం రూ.50 లక్షలు కోరింది. కానీ దురదృష్టవశాత్తు, ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఫిష్ వెంకట్ మరణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?