Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్ని వున్నా థియేట‌ర్ అనుభూతే వేరుః విశ్వక్ సేన్

ఎన్ని వున్నా థియేట‌ర్ అనుభూతే వేరుః విశ్వక్ సేన్
, గురువారం, 29 జులై 2021 (14:30 IST)
Dinesh Tej,Vishwak Sen, Pawan Kumar
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు.
 
విశ్వక్ సేన్ మాట్లాడుతూ, దినేష్ తేజ్ నేనూ 'హుషారుస‌ నుంచి ఫ్రెండ్స్. కలిసి క్రికెట్ బాగా ఆడేవాళ్లం. తను మంచి పర్మార్మర్. ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. చివరలో దినేష్ చెప్పిన డైలాగ్ సూపర్. థియేటర్లు ఓపెన్ అవడం సంతోషకరం. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్ లో సినిమా చూసిన అనుభూతి వేరు. ఆగస్టు 6న 'మెరిసే మెరిసే' థియేటర్ లలో రిలీజ్ అవుతోంది. తప్పక చూడండి అన్నారు.
 
దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా మీ ముందుకొస్తున్న 'మెరిసే మెరిసే' సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
- హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ, మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినందుకు నా ఫ్రెండ్ విశ్వక్ సేన్ కు థాంక్స్. ఆగస్టు 6న థియేటర్ లలో కలుసుకుందాం. అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగత్ సింగ్ నగర్ టీజర్ లో అసహనం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్