Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెన్సార్ పూర్త‌యిన‌ 'మెరిసే మెరిసే'

సెన్సార్ పూర్త‌యిన‌ 'మెరిసే మెరిసే'
, శనివారం, 17 జులై 2021 (18:30 IST)
dinesh tej, Shweta Avasthi
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ, నిర్మాత వెంకటేష్ కొత్తూరి సహకారంతో మెరిసే మెరిసే సినిమాను అనుకున్నట్లుగా తెరకెక్కించాం. ఇటీవలే సెన్సార్ వారు మా సినిమా చూసి అభినందించారు. యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను విడుదల చేసిన పీవీఆర్ సంస్థ మా మెరిసే మెరిసే సినిమాను రిలీజ్ చేస్తుంటడం సంతోషంగా ఉంది. ఆగస్టు 6న మీ ముందుకొస్తున్నాం. మా సినిమా పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ మెరిసే మెరిసేను హిట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
నటీనటులు: దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహ‌భాగం పూర్త‌యిన గోపీచంద్‌ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’