Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

Sobhita Dhulipala

సెల్వి

, బుధవారం, 25 సెప్టెంబరు 2024 (19:50 IST)
ఆగస్టు 9వ తేదీన హైదరాబాద్‌లో నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కాగా చైతూ, శోభిత నిశ్చితార్థమై రెండు నెలలు అవుతున్నా ఇంకా పెళ్లిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ ఏడాది చివరలో కానీ.. జనవరి, ఫిబ్రవరిలో పెళ్లి జరిగే అవకాశం ఉందని సమాచారం. 
 
ఈ నేపథ్యంలో నిశ్చితార్థం జరిగిన దాదాపు నెలన్నర రోజుల తర్వాత శోభిత ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చైతూకు భార్య అమ్మతనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని.. దానిపై క్లారిటీ వుంది. 
 
అంతేగాకుండా తన పెళ్లిలో తెలుగుతనం ఉట్టి పడాలని అనుకునేదాన్ని. తన తల్లిదండ్రులు, సంప్రదాయాలతో మమేకమయ్యే ఉన్నానని శోభిత వెల్లడించింది. తనకు కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో పిల్లలను కనాలని ఉందని.. అమ్మ ప్రేమ తాను పొందాలని శోభిత అన్నారు. 
 
తనకు తెలుగు ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె.. తాను అక్కినేని కోడలిగా గర్వపడుతున్నట్లు తెలిపారు. నిశ్చితార్థం అంగరంగ వైభవంగా ఊహించలేదని.. తీయగా.. నిరాడంబరంగా జరిగిందని తాను అనుకున్న రీతిలో జరిగిందని గుర్తు చేసుకున్నారు.
 
"తెలుగు వివాహాల్లో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెల్లటి చీర కట్టుకోవడం సాధారణం. నేను కూడా అలాంటిదే కట్టుకోవాలని అనుకుంటున్నా" అని శోభిత పంచుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్ కౌంటర్ అంటే మనిషిని హత్యచేయడమేనా? వేట్టైయాన్ ప్రివ్యూలో అమితాబ్ ప్రశ్న