Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

Advertiesment
Mangli

సెల్వి

, శనివారం, 15 ఫిబ్రవరి 2025 (21:35 IST)
2019 ఎన్నికలకు ముందు వైకాపాకు మద్దతుగా పాట పాడినందుకు తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నానని సింగర్ మంగ్లీ వెల్లడించారు. తన పాటలకు రాజకీయ పార్టీలకు అంటగట్టడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరపున పాడలేదని, తనకు ఎటువంటి రాజకీయ సంబంధం లేవని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇటీవల, కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో కలిసి ఆమె అరసవల్లి ఆలయాన్ని సందర్శించారు, ఇది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేడర్‌లో అసంతృప్తికి దారితీసింది. దీనిపై మంగ్లీ స్పందిస్తూ.. బహిరంగ లేఖ రాశారు.  
 
2019 ఎన్నికలకు ముందు, వైఎస్సార్సీపీ నాయకులు తనను సంప్రదించారని, వారి కోసం తాను ఒక పాట పాడానని మంగ్లీ వివరించారు. అయితే, తాను ఏ ఇతర రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని మంగ్లీ తెలిపారు. వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాకుండా వివిధ పార్టీల నాయకులకు తాను పాడానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీకి పాడటం వల్ల తనకు అనేక అవకాశాలు కోల్పోయాయని కూడా ఆమె విచారం వ్యక్తం చేశారు.
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం తాను పాడినట్లు వచ్చిన పుకార్లను తోసిపుచ్చిన మంగ్లీ, అలాంటి వాదనలు నిరాధారమైనవని, రాజకీయ లాభం కోసం తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంలో ఇది భాగమన్నారు. తనకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యతలు లేదా పక్షపాతాలు లేవని, తాను ఏ పార్టీకి ప్రచారకర్త కాదని మంగ్లీ చెప్పారు. తన పాటలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆమె ప్రజలను కోరారు. తన దృష్టి మొత్తం సంగీతంపైనేనని క్లారిటీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం