Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్ళి అయి ఇద్దరు పిల్లలున్న తండ్రితో సహజీవనం చేస్తున్న గాయని!!

పెళ్ళి అయి ఇద్దరు పిల్లలున్న తండ్రితో సహజీవనం చేస్తున్న గాయని!!
, శుక్రవారం, 15 మే 2020 (14:52 IST)
మాలీవుడ్‌లో ప్రముఖ గాయని అభయ హిరణ్మయి. ఈమె గత తొమ్మిదేళ్లుగా ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్‍తో సహజీవనం చేస్తోంది. పైగా, ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్యతో ఏర్పడిన మనస్పర్థలు కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ప్రస్తుతం గోపి సుందర్ విడాకుల కేసు కోర్టులో ఉంది. 
 
మరోవైపు, ఆయన గాయని అభయ హిరణ్మయితో సహజీవనం చేస్తున్నారు. దీనిపై గాయని అభయ స్పందిస్తూ, తొమ్మిదేళ్లుగా మేమిద్దరం సహజీవనం చేస్తున్నా. పైగా, ఆయన వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేనా.. మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం 12 యేళ్లు. ఇలా చాలా విషయాల్లో మా మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. 
 
పైగా, ఆయన భారీ కాయుడు. ఆయన ముందు నేను చాలా చిన్నగా కనిపిస్తాను. గత 2008 నుంచి రిలేషన్‌లో ఉన్నా తమ మధ్య ఇప్పటివరకు చిన్నపాటి మనస్పర్థలు కూడా రాలేదు. మేమిద్దరం కలిసి సంతోషంగా జీవిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
మరోవైపు, గోపి సుందర్ స్పందిస్తూ, 'విడాకుల కేసు కోర్టులో పెండింగులో వుంది.. ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను' అని చెప్పుకొచ్చారు. 2001లో గోపిసుంద‌ర్.. ప్రియ అనే మహిళను వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఆర్ఆర్ఆర్" విడుదల తేదీపై సరికొత్త ట్విస్ట్...