Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు` షాడో రిలీజైంది

ఎన్టీఆర్ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు` షాడో రిలీజైంది
, ఆదివారం, 7 మార్చి 2021 (13:06 IST)
Evaru melo koteeswarlu shadow
`మా` టీవీలో `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు` అనే ప్రోగ్రామ్ తెలిసిందే. నాగార్జున దానికి హోస్ట్‌గా వున్నాడు. ఇప్పుడు ఇటువంటి రియాల్టీ షోను జెమినీ టీవీ భుజాన వేసుకుంది. కానీ పేరుగా కొద్దిగా అటూఇటూ మార్చింది. అదే `ఎవరు మీలో కోటీశ్వరులు`. దీనిలో ఎన్‌.టి.ఆర్‌. హోస్ట్‌గా వ‌స్తున్న‌ట్లు ప‌లు సంద‌ర్భాల్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా, ఆదివారంనాడు ఏకంగా ఆయ‌న కుర్చీలో కూర్చున్న షాడో రూపంలో లోగో విడుద‌ల చేసింది. సినిమాలు చేస్తూ ఒక్క‌సారిగా బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు స‌రికొత్త రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు.
 
 ఇదిలా వుండ‌గా, ఒక్కోటి ఈ షోకు సంబంధించిన విష‌యాలు త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి ప‌లు ప్రోమోస్ షూట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్రివిక్ర‌మ్ వీటిని డైరెక్ట్ చేశారు. ఇప్ప‌టికే దీనిపై హోంవ‌ర్క్ చేశారు. అయితే గ‌తంలో చేసిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుల‌కు భిన్న‌మైన రీతిలో వినూత్నంగా జ‌ర‌ప‌నున్న‌ట్లు తెలిసింది. ఈ ఎపిసోడ్‌కు సూమారు కోటికి పైగా పారితోషికాన్ని తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఈ రియాల్టీ షో 2020లోనే ఆరంభం కావాల్సింది. కానీ కోవిడ్ వ‌ల్ల ఈ ఏడాదికి షురూ కానుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాతికేళ్ళ కుర్రోడితో దేవసేన ప్రేమాయణం!