బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. శ్రీమంతుడు సినిమా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్లో రూ.160 కోట్లు సాధించిన నేపథ్యంలో బ్రహ్మోత్సవం రైట్స్కు అన్ని చోట్ల భారీ డిమాండ్ ఏర్పడింది. ఇంకా బ్రహ్మోత్సవం రైట్స్ను ఓ పంపిణీ సంస్థ రూ.13 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు భార్య నమ్రత పర్యవేక్షణలో ఈ డీల్ జరిగిందని తెలుస్తోంది. అక్కడ వన్ లాంటి ప్లాప్ మూవీ కూడా వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసిందంటే ఓవర్సీస్లో మహేష్ స్టామినా ఏంటో తెలుస్తోంది. ఇక ఇటీవల పవన్ సర్దార్ గబ్బర్సింగ్ మూవీని రూ 10.5 కోట్లకు కొన్నప్పుడే అందరూ షాక్ తిన్నారు.
కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవం ఏకంగా రూ.13 కోట్లకు అమ్ముడుపోవడం.. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.70 కోట్లు దాటడం ప్రస్తుతం టాలీవుడ్ సినీ టౌన్లో హాట్ టాపిక్గా మారింది.