సెన్సేషనల్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ''రోగ్'' చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అనంతరం ఈ నెల 25వ తేదీ నుండి నందమూరి కళ్యాణ్ రామ్తో ఇంకో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాకుండా ''జనగణమన'' పేరుతో ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక సినిమాను పూరీ ప్రకటించిన విషయం తెలిసిందే. వరుస ప్రాజెక్ట్లతో సతమతమవుతున్న పూరీ ఒక బాలీవుడ్ సినిమాను బిగ్ బీతో చేయాలని నిర్ణయించుకున్నాడు.
దీనికి అమితాబ్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. దీని తర్వాత ఎన్టీఆర్తో ఒక సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. ఆ ప్రాజెక్ట్కి ''నేతాజీ'' అనే టైటిల్ కూడా ఖరారు చేశారట. ఈ ప్రాజెక్ట్ను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ నెల 20వ తేదీన పూరీ తెలియజేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. నేతాజీ అంటూ ప్రచారం సాగుతున్న ఈ సినిమా అసలు ఏంటి, దేశభక్తి కోణంలో ఉంటుందా మరేదైనా అనే అన్ని డౌట్లకు 20 వ తేదీ క్లారిటీ రానుంది. వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీ బీజీగా ఉన్న పూరీ ముందుగా ఏది చేస్తాడో చూడాలి.