Publish Date: Thu, 21 Nov 2019 (17:52 IST)
Updated Date: Thu, 21 Nov 2019 (17:53 IST)
జ్యోతి లక్ష్మి, వంగవీటి లాంటి చిత్రాలలో తనదయిన నటనతో మెప్పించారు సందీప్ మాధవ్(సాండీ). ప్రస్తుతం ఆయన నటించిన సినిమా ‘జార్జ్ రెడ్డి’. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి..సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బేనర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ నవంబర్ 22న అభిషేక్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సందీప్ మాధవ్ తన స్పందనను మీడియాతో పంచుకున్నారు.
‘వంగవీటి’ సినిమా తరవాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అన్ని కొంచెం సీరియస్ క్యారెక్టర్ కావడంతో అంగీకరించలేదు. అందులోనూ ఆ సినిమా తరవాత చేయదగ్గ సినిమా అనిపించే స్థాయిలో ఏదీ కనెక్ట్ కాలేదు. జీవన్ గారు నాకు బ్రదర్ లాంటివారు. ఆయన ఈ కథ నాకు చెప్పారు. ఇలాంటి క్యారెక్టర్ కదా చేయాల్సింది అని చాలా ఎగ్జైటెడ్ అయ్యాను. వెంటనే చేద్దాం బ్రదర్ అని చెప్పి వెంటనే‘జార్జ్ రెడ్డి’ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను.
పవన్ కల్యాణ్ గారు జార్జిరెడ్డి ట్రైలర్ చూశారు. చాలా ఇంప్రెస్ అయ్యి తనని కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. అలా మాట్లాడడం జరిగింది కానీ.. కొన్ని పరిస్థితులవల్ల కుదరలేదని మీ అందరికీ తెలుసు. నేను ఆయనకు హార్డ్ కోర్ ఫ్యాన్ ని. ఆయన నా సినిమాకి వస్తారని చాలా ఆశ గా ఎదురుచూశాను. కానీ దురదృష్టవశాత్తు కుదరలేదు అని చెప్పారు.