Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైతూతో కలిసివున్న ఇంటిని మళ్ళీ కొనుగోలు చేసిన సమంత

Murali mohan
, శుక్రవారం, 29 జులై 2022 (14:16 IST)
టాలీవుడ్ క్యూ కపుల్స్‌గా గుర్తింపు పొందిన హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల దాంపత్య జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడిపోయారు. అయితే, చైతూతో కలిసివున్న జ్ఞాపకాలను మాత్రం సమంత మరిచిపోలేకున్నారు. అందుకే నాగ చైతన్యతో కలిసి దాంపత్య జీవితం చేసిన ఇంటికి భారీ ధరకు సమంత కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని నటుడు మురళీ మోహన్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ అపార్టుమెంటులో ఓ ఇంటికి చైతన్య ఇష్టపడి కొన్నారని చెప్పారు. పెళ్ళైన తర్వాత వారిద్దరూ కలిసి అక్కడే ఉన్నారని తెలిపారు. అయితే, విడాకుల తర్వాత వాళ్లిద్దరూ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని, కానీ, ఇటీవల సమంత ఆ ఇంటిని మళ్లీ ఎక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారని ఆయన వివరించారు. 
 
"నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది. ఇలాంటి. అందమైన, ప్రశాంతమైన ఇల్లు నాకు మళ్లీ నాకు దొరకడం లేదు. ఈ ఇల్లు మళ్లీ నేను తీసుకోవచ్చా" అని సమంత అడిగింది. దాంతో నేను ఆ ఇంటిని ఎవరికైనా అమ్మారో వాళ్లతో మాట్లాడి, వాళ్ళను ఒప్పించి, తిరిగి సమంత కొనుగోలు చేసేలా చేశాను. కానీ, ఎక్కువ డబ్బులు చెల్లించారని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామారావు డ్యూటీ స‌రిగ్గా చేశాడా! రివ్యూ రిపోర్ట్‌