Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరంగల్ బస్టాండ్‌లో ఒంటరిగా సాయిపల్లవి.. ఏమైంది..?

వరంగల్ బస్టాండ్‌లో ఒంటరిగా సాయిపల్లవి.. ఏమైంది..?
, గురువారం, 19 సెప్టెంబరు 2019 (17:51 IST)
సహజనటి సాయిపల్లవి వరంగల్లో ప్రత్యక్షమైంది. అదీ కూడా ఒంటరిగా కూర్చుని కనిపించింది. సాధారణ ప్రయాణీకురాలిగా అందరితో కలిసిపోయింది. పది నిమిషాల పాటు బస్టాండ్లో కూర్చునే ఉంది. ఎవరూ ఆమెను గమనించలేదు. అయితే ఆమె మాత్రం పది నిమిషాల పాటు బస్టాండ్లోనే కూర్చుండి పోయింది.
 
అసలు ఎందుకు సాయిపల్లవి వరంగల్ బస్టాండ్లో కూర్చుందో ఆ తరువాత గానీ అక్కడున్న వారికి అర్థం కాలేదు. విరాట పర్వం షూటింగ్‌లో భాగంగా సాయిపల్లవి అక్కడ కూర్చుంది. కెమెరామెన్ కూడా రహస్యంగా విజువల్స్‌ను కెమెరా ద్వారా చిత్రీకరించారు. 
 
అయితే సాయిపల్లవి పైకి లేచి వెళ్ళేటప్పుడు మాత్రం కొంతమంది గుర్తుపట్టారు. సాయిపల్లవి అంటూ గట్టిగా అరిచారు. ఇంతలో చుట్టూ కూర్చున్న యూనిట్ సభ్యులు అభిమానులు ఆపేశారు. సాయిపల్లవి అక్కడి నుంచి లేచి కారు ఎక్కి వెళ్ళిపోయారు. 
 
తెలంగాణా యాసలో సాయిపల్లవి ఈ సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పటికే ఫిదా సినిమాతో తెలంగాణా యాసలో మాట్లాడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సాయిపల్లవి. విరాట పర్వంలో రానా హీరో. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో దక్షిణాది స్టార్ హీరోయిన్...ఫోటోలు వైరల్