Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుడిగాలి సుధీర్ ఇంట్లో కరోనా విషాదం.. ప్రోమో విడుదల

సుడిగాలి సుధీర్ ఇంట్లో కరోనా విషాదం.. ప్రోమో విడుదల
, సోమవారం, 17 మే 2021 (20:26 IST)
కోవిడ్ మహమ్మారి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట్లోనూ విషాదం నింపింది. సుధీర్ అమ్మమ్మ ఇటీవలే కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వేదికగా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెళ్లలేకపోయాడని.. చివరి చూపు కూడా దక్కలేదని వెల్లడించారు. ఆదివారం ఈటీవీలో ప్రసారం కావాల్సిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో యూట్యూబ్‌లో విడుదలయింది. 
 
అందులో ఎప్పటిలాగే కామెడీతో పాటు ఈసారి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన స్కిట్ చేశారు. అందరూ ఇంట్లోనే ఉండాలని.. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని అందులో తెలిపారు. అందులో ఆటో రాంప్రసాద్ అద్భుతంగా నటించారు.
 
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని.. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా వీక్షకులకు సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని చెప్పారు. ఇక సుధీర్ అమ్మమ్మ మరణించారని రాంప్రసాద్ ఈ విషయాన్ని చెబుతుంటే ఆయన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూసూద్‌ను వదలట్లేదు.. జాగ్రత్త.. హనుమ విహారి ట్యాగ్ ఎందుకని..?